కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను శుక్రవారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి, వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని, వాన దేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.