పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో ప్రధాన సూత్రధారి సుభోధ్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని పీటీ వారెంట్పై కరీంనగర్కు తరలించారు. నిందితుడిని విచారించి రిమాండ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.