బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో పాత విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా తొలగించారు. సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జూలై 3 నుంచి 5వ తేదీ వరకు నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని సర్పంచ్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పొందాలని, గ్రామస్తులు, యువత సహకరించాలని కోరారు.