గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో కరీంనగర్ కలెక్టరేట్లో ఉన్న ఎన్నారై సెల్ ద్వారా వారి సమస్యలు పరిష్కారమయ్యేవి. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు లేకపోవడంతో గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ఎలాంటి సహాయం అందడం లేదు. సుమారు లక్ష మంది ఉమ్మడి జిల్లా వాసులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు.
వీసా, ఉద్యోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారికి తక్షణ సహాయం అందక ఇబ్బందులు పడుతున్నారు.