ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ దశల్లో నిలిచిపోయిన దాదాపు 5,600 ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఈ గృహాల పూర్తికి రూ. 2 లక్షల చొప్పున సాయం అందనుంది. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకొని, అధికారుల అనుమతితో పనులు పూర్తి చేస్తే బిల్లులు విడుదలవుతాయి. జూన్ 1 నుంచి 'ఇందిరమ్మ' పథకం వర్తించనుంది.