పెండింగ్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై నిరసనగా, సెస్ ఉద్యోగులు ఈనెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుండి 72 గంటల పాటు విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. సెస్ ఎండీ బిక్షపతికి వినతిపత్రం అందజేశారు. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, ఎన్టీఏ చెల్లించాలని ఉద్యోగుల సంఘం నాయకులు అనిల్ కుమార్, మల్లేశం డిమాండ్ చేశారు.