మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్గా
కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరామ్ను ప్రభుత్వం బుధవారం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా, శ్రీరామ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవ చేస్తానని శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ నియామకం పట్ల జిల్లా
కాంగ్రెస్ నేతలు, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.