కరీంనగర్లో కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పనిపాట లేకుండా ప్రభుత్వంపై అనవసరంగా కొట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే ఓర్వలేక విమర్శిస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.