తెలంగాణలో రెండు వేర్వేరు బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద, మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవడంతో వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.