మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట గ్రామంలో శుక్రవారం క్వారీలో వాచ్మెన్గా పనిచేస్తున్న చర్ల పరుశురాం (49) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల ప్రాథమిక విచారణలో గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. పరుశురాంకు భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.