ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


దేశంలో అత్యంత రద్దీగా ఉండే టాప్-10 ఎయిర్‌పోర్టులు ఇవే!
Dec 01, 2025, 08:12 IST/

దేశంలో అత్యంత రద్దీగా ఉండే టాప్-10 ఎయిర్‌పోర్టులు ఇవే!

Dec 01, 2025, 08:12 IST
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశంలో అత్యంత రద్దీగా ఉండే టాప్-10 విమానాశ్రయాలను వెల్లడించింది. ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అత్యధికంగా 7.92 కోట్ల మంది ప్రయాణికులతో మొదటి స్థానంలో నిలిచింది. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 5.51 కోట్ల మంది ప్రయాణికులతో రెండో స్థానంలో, బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 4.18 కోట్ల మంది ప్రయాణికులతో మూడో స్థానంలో, HYD రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 2.91 కోట్ల మందితో నాలుగో స్థానంలో నిలిచింది.