
ప్రపంచంలో నెక్స్ట్ సూపర్ పవర్గా భారత్
ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, భారత్ ను అమెరికా, చైనాలతో పాటు తదుపరి ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. భారత్ కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను భారత్ కు గొప్ప అభిమానినని, విదేశీ వ్యవహారాల్లో భారత్ అనుసరిస్తున్న విధానాలు సరైనవని స్టబ్ పేర్కొన్నారు. యూఎన్ భద్రతా మండలిని విస్తరించి, ఆసియా నుంచి భారత్ వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఆయన సూచించారు. భారత్ కు స్థానం లేకపోతే సంస్థ బలహీనపడుతుందని అభిప్రాయపడ్డారు.




