గురువారం బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ దేవతలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.