Jan 30, 2026, 16:01 IST/చొప్పదండి
చొప్పదండి
పోతుగంటిపల్లి గ్రామంలో ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి మృతి
Jan 30, 2026, 16:01 IST
గంగాధర మండలం పోతుగంటిపల్లి గ్రామానికి చెందిన 85 ఏళ్ల కదారి మల్లారెడ్డి, భార్య మరణానంతరం ఒంటరితనం, మానసిక వేదనతో బాధపడుతూ శుక్రవారం తన గదిలో ధోతితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అతని కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై బీ వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లారెడ్డి తన చిన్న కొడుకు ఇంటి ఆవరణలోని ఒక గదిలో ఉంటున్నారు.