14, 15 తేదీల్లో రాష్ట్ర మహాసభలు

9చూసినవారు
14, 15 తేదీల్లో రాష్ట్ర మహాసభలు
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్‌ రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 14, 15 తేదీల్లో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ పట్టణంలో జరగనున్న ఈ మహాసభల్లో, మున్సిపల్‌ కార్మికుల పర్మినెంట్‌, కనీస వేతనం రూ. 26 వేలు సాధనకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించుకుంటామని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి తెలిపారు. 14న జరిగే బహిరంగ సభకు వేలాది మంది మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్