రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో విద్యుత్ వైర్తో చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తూ బానోత్ శర్మన్ (48) అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీపూర్ తండా సమీపంలోని వాగులో ఈ విషాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.