రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీనితో స్థానిక ప్రజలు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ జగదీష్ చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే, భారీ కొండచిలువను చూసేందుకు జనం గుమిగూడటంతో రద్దీ ఏర్పడింది.