సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ఒక ప్రకటనలో వాహనదారులకు సూచనలు జారీ చేశారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీ) బిగించడానికి గడువు విధించలేదని, ఈ నెల 30వ తేదీలోగా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేకుంటే జరిమానాలు విధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. నంబరు ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని, ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని డీటీఓ సూచించారు.