తమిళనాడులోని కరూర్లో టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట కేసు దర్యాప్తును సీబీఐ అధికారికంగా చేపట్టింది. రాష్ట్ర పోలీసుల ఎఫ్ఐఆర్ను తిరిగి నమోదు చేసి, స్థానిక కోర్టుకు సమాచారం అందించింది. టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ పేర్లను చేర్చింది. టీవీకే సుప్రీం కోర్టును ఆశ్రయించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.