తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర దర్శనానికి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆమె హన్మకొండకు చేరుకోగా, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జాతర సందర్భంగా సమ్మక్క–సారలమ్మలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో తెలంగాణ జాగృతి నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.