TG: మిడ్జిల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి? ఫామ్ హౌజ్లో బందీ అయిన పాపాల భైరవుడు ఎందుకు రావాలి? అని ప్రజలు చర్చ పెట్టాలి. పదేళ్లలో రాష్ట్రం రూ.8లక్షల కోట్ల అప్పులపాలైంది. కేసీఆర్ మాత్రం రూ.లక్ష కోట్లు సంపాదించారు. ఎలా సంపాదించారో చెప్పాలి. బీఆర్ఎస్కు గతమే తప్ప భవిష్యత్తు ఉండదు' అని ఫైర్ అయ్యారు.