ఎర్రవల్లి నుంచి బయల్దేరిన కేసీఆర్

55చూసినవారు
ఎర్రవల్లి నుంచి బయల్దేరిన కేసీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు నేడు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని తన నివాసంలో విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వాహనంపై కార్యకర్తలు పూలవర్షం కురిపించగా, ఆయన వారికి అభివాదం చేస్తూ వెళ్లారు. కాన్వాయ్‌ వెంట భారీగా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు.

సంబంధిత పోస్ట్