భారత్ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. అమెరికా దిగుమతులపై 75% వరకు సుంకాలు విధించి ప్రధాని ధైర్యంగా ముందడుగు వేయాలని ఆయన కోరారు. అలాంటి నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలంతా ఆయనకు పూర్తి మద్దతు ఇస్తారని చెప్పారు. అధిక పన్నులు విధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ముందే మోకరిల్లుతాడో లేదో చూద్దామంటూ వ్యాఖ్యానించారు.