ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'కేజ్రీవాల్ తప్పు చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పు చేయలేదు. ప్రధాని మోదీ ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. మా పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారు’ అని అన్నారు.