ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లెబనాన్లో హెజ్బొల్లా కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి చెందారు. సౌదీ పత్రిక అల్ అరేబియా ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం ఉదయం నుండే ఇజ్రాయెల్ హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం.