ఇటీవల దగ్గు సిరప్ కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో 20 మంది చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో నలుగురు మరణించడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్, ఫైనల్ ప్రొడక్ట్స్ లను క్షుణ్నంగా టెస్ట్ చేయాలని సూచించింది. 4 ఏళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.