తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెప్టెంబర్ 15న హైదరాబాద్కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన వెంకటేశ్వర్లు(38) అదృశ్యమైన కేసులో ఆయన స్నేహితుడు అశోక్ ప్రధాన నిందితుడిగా తేలాడు. వెంకటేశ్వర్లు వద్ద ఉన్న నగదు కోసమే ఈ హత్యకు ప్లాన్ చేశాడు. సెప్టెంబర్ 16న వెంకటేశ్వర్లును తన రూమ్కు పిలిపించి నిద్రిస్తున్న సమయంలో ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత శరీరం భాగాలను బైక్పై ఖమ్మం శివారు ప్రాంతాల్లో పడేశాడు.