ఖమ్మం కమిషనరేట్ లో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సీపీ సునీల్ దత్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను కూడా అభినందించారు. పదవీ విరమణ చేసిన అధికారులు ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.