‘స్థానిక’ ఎన్నికల తర్వాత భూధార్‌ కార్డులు: మంత్రి పొంగులేటి

5చూసినవారు
‘స్థానిక’ ఎన్నికల తర్వాత భూధార్‌ కార్డులు: మంత్రి పొంగులేటి
భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతిని తయారు చేశామన్నారు. 9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించినట్లు చెప్పారు. భూభారతిలో చెప్పిన విధంగా భూధార్‌ కార్డులు సిద్ధం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు.