ప్రధాని నరేంద్ర
మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో,
బీజేపీ తమ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని
మోదీ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు ప్రజలను అధిక సంఖ్యలో తరలిరావాలని ఆహ్వానిస్తూ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంగళవారం ఖమ్మంలో స్వయంగా గోడలపై "ఛలో పరేడ్ గ్రౌండ్స్" అని రాశారు. అంతేకాకుండా, ఆయన
బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వును కూడా చిత్రించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఈ వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.