ఖమ్మంలోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి సగం కాలం గడిచినా ఆశించిన ప్రగతి లేదని, రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
కేటీఆర్ పాదయాత్ర,
కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైతే కాంగ్రెస్కు ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.