ఖమ్మం కలెక్టరేట్ లోని జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి గురువారం ప్రారంభించారు. పురపాలక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై ఈ కేంద్రం ద్వారా నిఘా ఉంచుతారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని సూచించారు.