ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ టిఎస్ దివాకర ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, ఇరువురు నూతన కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కలెక్టర్ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ కూడా పాల్గొన్నారు.