జన చైతన్యమే లక్ష్యంగా సీపీఐ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు భారీ జన సమీకరణతో పాటు ఇంటింటికీ, ప్రతి వ్యక్తికీ శతాబ్ది ఉత్సవ సందేశాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.