ఖమ్మం పోలీసులు సైబర్ భద్రతపై గురువారం అవగాహన కల్పించారు. తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంక్ వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి, 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని, తద్వారా ఆర్థిక నష్టాల నుంచి రక్షణ పొందవచ్చని సీపీ సునీల్ దత్ సూచనలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించారు.