మొదటి తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పంట అంతా నష్టపోయినట్లు, పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఓ యువ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం వెంటనే చిన్న, సన్నకారు రైతులను గుర్తించి, తగిన పరిష్కారం చూపాలని, పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా సహాయం చేయాలని కోరుతున్నాడు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టినా, పెట్టుబడి మొత్తం కూడా రావడం లేదని సాయిరాం అనే యువ రైతు ఒక వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు.