బుధవారం, ఆళ్లపల్లి మండలం రామాంజి గూడెం గ్రామంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ ట్రాక్టర్ ఇంజన్ కింద ఇరుక్కుపోయాడు. అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దీన్ని గమనించి, జేసీబీ సహాయంతో ట్రాక్టర్ ఇంజన్ను తొలగించి, డ్రైవర్ను 108 ద్వారా ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటన పిన్పాకలో జరిగింది.