ఖమ్మం జిల్లాలోని సంభాని నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జోయాలుకాస్ షోరూం మేనేజర్ సంతోష్ను ఘనంగా సన్మానించారు. జోయాలుకాస్ సంస్థ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్, వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్లు, కంపాస్ బాక్స్లు పంపిణీ చేసిన సందర్భంగా ఈ సత్కారం జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు గౌరీ, ఉపాధ్యాయులు సంతోష్ను శాలువా, బోకేతో సత్కరించి, విద్యార్థుల విద్యాభివృద్ధికి సంస్థ అందించిన సహకారాన్ని అభినందించారు.