పర్మిషన్ లేకుండా కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కనీస సౌకర్యాలు లేకుండా ఖమ్మం నగరంలో రోజుకో అకాడమీ పేర్లతో మెడికల్ కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తున్నా సంబంధిత యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.