ఖమ్మం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ దివాకర్, జిల్లాలో వ్యవసాయం, సాగు నీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, నానో యూరియా వాడకం, పంట అవశేషాలు కాల్చడం వల్ల కలిగే నష్టాలు, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు.