ఖమ్మం జిల్లాలో వర్షాల ప్రభావం తగ్గిన నేపథ్యంలో, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నందున ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రేపు (శుక్రవారం) తిరిగి ప్రారంభమవుతుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కావున, రైతు సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్ కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.