నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు గురువారం సెలవు ప్రకటించారు. జనవరి 1న క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరిగి శుక్రవారం నుంచి మార్కెట్లో కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని వివరించారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గమనించి, పంట ఉత్పత్తులను మార్కెట్ కు తీసుకురావద్దని అధికారులు కోరారు.