ఖమ్మం 6వ డివిజన్ ప్రశాంతినగర్ లో నూతనంగా నిర్మించిన అంగన్ వాడీ కేంద్రాన్ని మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలు కీలకమని, గర్భిణులు, బాలింతలు అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. సమీపంలోని చిన్నారులను క్రమం తప్పకుండా కేంద్రానికి పంపించాలని పిలుపునిచ్చారు.