ఖమ్మం జిల్లాలో మంగళవారం అఖిలభారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ కమిటి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కల్లూరుకు చెందిన కాటేపల్లి రజనీకాంత్ అధ్యక్షులుగా, లంకా అప్పలనాయుడు ఉపాధ్యక్షులుగా, చిర్రా రవి కార్యదర్శిగా, ఆళ్ల వెంకటేశ్వరరావు కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 11 మంది సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పిఅర్ఓ జనగామ తిరుపతి ఎన్నికల అధికారిగా, గుండాగాని ఉప్పలయ్య పరిశీలకులుగా వ్యవహరించారు.