జనగణన-2027కు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్లను గుర్తించి సి. యం. యం. యస్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ నుండి జనగణన కార్యక్రమం, పిఎన్జీ గ్యాస్ పైప్ లైన్, ధ్యానం కొనుగొలు కేంద్రాల ఏర్పాటుపై తహశీల్దార్లు, ఎంపిడిఓలు, వ్యవసాయ అధికారులతో జిల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.