ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి, పత్తి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 21,500, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 21,100గా నమోదైంది. పత్తి క్వింటా ధర రూ. 8,700 పలికింది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 300 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 500, పత్తి ధర రూ. 200 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు.