ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బదిలీ అయ్యారు. ఆయనకు ఐటీఈ అండ్ సీ జాయింట్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. ఆయన స్థానంలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర్ ను ఖమ్మం జిల్లాకు కేటాయించారు. అనుదీప్ గత ఏడాది జూన్ 13న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు.