జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఇవిఎం గోడౌన్ ను నెలవారీ తనిఖీ చేశారు. గోడౌన్ సీళ్లను పరిశీలించి, అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సైరన్ ను కూడా పరిశీలించారు. ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.