ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ అభిషేక్ అగస్త్య బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. 46వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 17వ డివిజన్లో రోడ్డు నిర్మాణ పనులను కూడా పరిశీలించి, అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని సూచనలు చేశారు.