ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని, అదే విధంగా పట్టణాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ఓటర్లు దీవిస్తారని అన్నారు. టికెట్ రానివారికి న్యాయం చేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.